Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: త్వరలో గుడ్ న్యూస్ అంటున్న తిక్కారెడ్డి

Mantralayam: త్వరలో గుడ్ న్యూస్ అంటున్న తిక్కారెడ్డి

టీడీపీ అభ్యర్థిగా కచ్చితంగా అసెంబ్లీకి పోటీ

మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను కచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేస్తానని.. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి శుభవార్త వింటారని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పాలకుర్తి తిక్కారెడ్డి తెలియజేశారు. మంత్రాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోసిగి మండలం జుమ్మాలదిన్నె, గౌడుగల్, వందగల్, నేలకోసిగి, కోల్మన్ పేట, దుద్ది, ఆర్లబండ గ్రామాల నాయకులు కార్యకర్తలతో భవిష్యత్తు కార్యాచరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పునరాలోచన చేసి నాకు కచ్చితంగా టికెట్ ఇస్తారు మీరు ఎన్నికలకు సిద్ధం ఉండాలని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి, వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్వాజ్ శెట్టి,సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, చావిడి వెంకటేష్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, అశోక్ రెడ్డి, సిద్దప్ప ధని, రాగన్న, గవిగట్టు ఈరయ్య, గుండాల ఈరయ్య, తిక్కస్వామి గౌడ్, కోల్మన్ పేట మదిరి వీరారెడ్డి,ఆర్లబండ రామాంజనేయులు, బాను ప్రకాష్, జుమ్మాలదిన్నె రాగయ్య, నేలకోసిగి తిమ్మప్ప, వందగల్ కర్రప్ప, దుద్ది ఈశ్వర్, మల్లేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News