Tuesday, July 15, 2025
Homeఓపన్ పేజ్Jadcharla: చిరస్మరణీయుడు మహానేత వైయస్సార్

Jadcharla: చిరస్మరణీయుడు మహానేత వైయస్సార్

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

కోట్లాది ప్రజల గుండెల్లో చిరస్మరణీయునిగా నిలిచిన మహానేత వైయస్సార్ అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. వైయస్సార్ జయంతి సందర్భంగా ఫ్లై ఓవర్ సమీపంలో ఉన్న వైయస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్సార్ అందించిన సేవలు మరువలేనివని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్, వెంకటయ్య, సయ్యద్ మీనాజుద్దీన్, నిత్యానందం, మాలిక్ షాకీర్, జగదీష్ చారి, లక్ష్మణ్, కౌన్సిలర్లు చైతన్య చౌహన్, రాజు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News