Monday, September 16, 2024
Homeనేరాలు-ఘోరాలుMallapur: 4 కిలోల గంజాయి స్వాధీనం

Mallapur: 4 కిలోల గంజాయి స్వాధీనం

21 ఏళ్ల వ్యక్తి వద్ద నుంచి..

గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మండల ఎస్ఐ పబ్బ కిరణ్ కుమార్ తెలిపారు. మండలంలోని రేగుంట గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహించగా రేగుంట గ్రామానికి చెందిన రావులకారి నితిన్ (21) అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని తనిఖీ చేయగా, దాదాపుగా నాలుగు కిలోల గంజాయి పట్టుబడిందని దీంతో వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

- Advertisement -

ఈ సందర్బంగా ఎస్సై కిరణ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి అమ్మేవారిపై, గంజాయి తీసుకునే వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, అలాంటి వారిపై చట్టరీత్యా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News