Sonia Gandhi admitted in hospital: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. నిన్న అనగా.. జూన్ 15, 2025 న రాత్రి సమయంలో, సోనియా గాంధీని ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆవిడ ఉదర సంబంధ సమస్యతో ఉండటంతో హాస్పిటల్ లో చేరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆవిడకు గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో వైద్య పరీక్షలు జరిపి.. పర్యవేక్షణలో ఉంచినట్లు ఆసుపత్రి యాజమాన్య అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం సోనియా గాంధీ గారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఇదే నెల ప్రారంభంలో రక్తపోటు కారణంగా జూన్ 7 న కూడా ఆమెను సిమ్లాలోని ఐజీఎంసీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే వైద్య పరీక్షల అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎటువంటి తీవ్రమైన సమస్యలేదని వైద్యులు తెలిపారు. మళ్ళీ కొద్ది రోజులకే ఆవిడ హాస్పిటల్ లో చేరడం గమనార్హం.
ఆమె ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కాస్త కలవరం మొదలైంది. అయితే వైద్యులు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పడంతో కాస్త ఊపిరిపీల్చుకున్నారు. పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సైతం సోనియా దూరంగా ఉంటున్నారు. కేవలం కీలకమైన సీడబ్య్లూసీ సమావేశానికి మాత్రమే ఆమె హాజరవుతున్నారు. అనారోగ్యంతో ఉంటున్న కానీ పార్టీ కార్యక్రమాలకు హాజరై తన నిబద్ధతను ఆమె చాటుతున్నారు.