Friday, September 20, 2024
HomeNewsVamshidhar Reddy: ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు

Vamshidhar Reddy: ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు

గడప గడపకు కాంగ్రెస్..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఏఐసిసి కార్యదర్శి చల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఏ సి సి కార్యదర్శి చల్లా వంశీచందర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలు మండల పరిధిలోని పోలేపల్లి మాలపల్లి గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల గురించి వివరించారు. ఈసందర్భంగా వారు ఆరు గ్యారెంటీ ల పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించేందుకు సానుకూలంగా ఉన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సర్వేలు కాంగ్రెస్సే పార్టీకి అనుకూలంగా వస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం కల్వకుర్తి మండల పరిధిలోని వేపూర్ గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ చేరారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తదుపరి వెళ్లండ మండలం రాచూరు గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శీను, పడకంటి వెంకటేష్, తక్కెలపల్లి శేఖర్, వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News