Sunday, May 5, 2024
HomeతెలంగాణMantralayam: రాఘవేంద్రా రెడ్డి నామినేషన్

Mantralayam: రాఘవేంద్రా రెడ్డి నామినేషన్

మంత్రాలయం పసుపుమయం

మంత్రాలయం క్షేత్రం పసుపు మాయమైంది. మంత్రాలయం ఉమ్మడి తెలుగుదేశం టీడీపీ అభ్యర్ధి ఎన్ రాఘవేంద్ర రెడ్డీ నామినేషన్ వేశారు. మాధవరం గ్రామం నుంచి వాహనాల్లో కార్యకర్తలతో బయలు దేరిన రాఘవేంద్రా రెడ్డి నేరుగా రాఘవేంద్ర స్వామి మఠానికి చేరుకుని, గ్రామ దేవత మంచలమ్మ, రాఘవేంద్ర స్వామి బృందావనానికి పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు.

- Advertisement -

టిడిపి జిల్లా అధ్యక్షులు పీ. తిక్కారెడ్డి, ఎంఎల్ సి బీటీ నాయుడు, బీజేపీ నాయకుడు బీ పురుషోత్తం రెడ్డీలతో కలసి నామినేషన్ దాఖలు చేశారు.

నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల రాకతో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సర్కిల్ పసుపు మయమైంది. ఈ కార్యక్రమంలో నాయకులు హులిగయ్య, ముత్తారెడ్డి, రామిరెడ్డి, సురేష్ నాయుడు, రఘునాథ్ రెడ్డీ, రామకృష్ణారెడ్డి, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News