Sunday, May 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Athmakuru: శ్రీశైలం ప్రజల ఆశీర్వాదం ఎవరికి దక్కేనో?

Athmakuru: శ్రీశైలం ప్రజల ఆశీర్వాదం ఎవరికి దక్కేనో?

ఇక్కడి విజయం వరించేదెవరిని?

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పోటాపోటీగా దూసుకుపోతున్న ఇద్దరు బలమైన నాయకుల్లో ఏ నాయకుడిని ప్రజల ఆశీర్వదిస్తారన్నది ఆసక్తిగా మారింది. శ్రీశైలం నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదాలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైపా… శిల్పా చక్రపాణి రెడ్డి వైపా అని ఆత్మకూరు పట్టణంలో చర్చనీయంగా మారింది.

- Advertisement -

నియోజకవర్గంలో ప్రజలకు ఎంత న్యాయం జరిగిందని తెలుగుదేశం అభివృద్ధి.. వైసీపీ అభివృద్ధి ..ఎవరెవరు ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకే తెలుసని, ఏ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి మహిళలకు నిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అందాయో, న్యాయం జరిగిందో అటువైపే ప్రజా ఓటర్ల ఆలోచనా కొనసాగుతుంది. ఇరువర్గాల వారు తమతమ నాయకుడిదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు నియోజకవర్గంలో టిడిపిలోకి వలసలు జాతర రూపంలో వెళుతుంటే మరోవైపు వైసీపీలోకి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. గెలుపు కోసం ఎవరికివారు ప్రజలను ఆకట్టుకోవడంలో నాయకులు ముందున్నారు. ఆత్మకూరు పట్టణమంతా రాజకీయంతో వేడెక్కి ప్రజల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు అనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి.

శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి తమ ప్రియతమ నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు ఏ నేత ఎంత మెజార్టీ ఇస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News