Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: చేనేత కుటుంబాలకు వైసిపి ఏం సమాధానం చెబుతుందని నిలదీస్తున్న బీవీ

Emmiganuru: చేనేత కుటుంబాలకు వైసిపి ఏం సమాధానం చెబుతుందని నిలదీస్తున్న బీవీ

టిడిపి క్రొవ్వొత్తులతో నివాళి

వైసిపి దాష్టీకానికి చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమి సమాధానం చెబుతారని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రశ్నించారు. తెలుగు ప్రభ ప్రతినిధితో మాట్లాడుతూ ..కడప జిల్లా ఒంటి మిట్ట మండలం మాధవరంలో చేనేత కుటుంబానికి చెందిన భూమిని వైసిపి నాయకులు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. వైసిపి నాయకులతో పోరాడలేని చేనేత కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందంటూ బీవీ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బీసీలు ఆత్మహత్య చేసుకుంటే జగన్ స్పందించ లేదని బీవీ భగ్గుమన్నారు. ఆత్మహత్యకు కారకులైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

టిడిపి చేనేత విభాగం నాయకులు చేనేత మల్లికార్జున , మిన్నల్ల, దామ నరసింహులు, దేవేంద్ర, గోవిందు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక సోమప్ప సర్కిల్ లో టిడిపి చేనేత విభాగం అధ్వర్యంలో నివాళి అర్పించారు. కార్యక్రమంలో టిడిపి చేనేత విభాగం నాయకులు బిజ్జే నాగరాజు, మాదుగుండు లక్ష్మన్న, మద్దయ్య, కామార్తీ మహేష్,పట్టా నాగరాజు, ఈశ్వర్,డ్రైవర్ ఈరన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News