Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: ఇన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు

Gangula: ఇన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు

'గడప గడపకు'లో పాల్గొన్న ఎమ్మెల్యే

పేదలకోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని 6 సచివాలయం పరిధిలోని 10వ వార్డులోని టీచర్స్ కాలనీ విజయపురి వీధి జమున వీధి , చింతకుంటలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు, కౌన్సిలర్ గోట్లూరు సుధాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి, సింగం వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్, డాాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే తెలపాలని అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధితోనే పేదల బతుకులు మారుతాయని అన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి పథకాలు అమలు చేసిన దాఖలా లేవన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన కన్నా ఎక్కువ పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వమని , పేదింటి కష్టాలు తొలగించే పథకాలు ప్రతి గడపకు అందుతున్న పథకాలని , పేద ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి మేలు చేసేలా పథకాలు తీసుకొచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లుఆయన వెల్లడించారు అంతకుముందు అక్కడికి చేరుకున్న ఆయనకు వైకాపా నాయకులు ప్రజలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రెడ్డి ,నజీర్, పంచ నాగరాజు, భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు బాలబ్బి , చక్రపాణి, కో ఆప్షన్ మెంబర్ రమేష్ గౌడ్, ఏఈలు , సురేంద్ర రెడ్డి, కంబగిరి, రమణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది బాలస్వామి, మెప్మా సుబ్బయ్య, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News