Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: బ్యాంక్ అభివృద్ధికి అందరం కృషి చేద్దాం

Kurnool: బ్యాంక్ అభివృద్ధికి అందరం కృషి చేద్దాం

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఎస్ వి విజయ మనోహరి సమీక్షా సమావేశం

కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఎస్ వి విజయ మనోహరి కర్నూలు KDCC బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్ నందు ఉమ్మడి జిల్లా ఫీల్డ్ ఆఫీసర్స్ మీటింగ్ కు హాజరై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఫీల్డ్ ఆఫీసర్ లు ఆమెకు శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బ్యాంక్ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. బ్యాంక్ లోన్ లు, రికవరిలు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి అని కోరారు. అన్ని విధాలుగా బ్యాంక్ అభివృద్ధి చెందే విధంగా పనులు చేయాలని, మన రాష్ట్రంలోనే మన కర్నూలు KDCC బ్యాంక్ అభివృద్ధి ప్రథమ స్థాయిలో ఉండాలని ఉమ్మడి కర్నూలు జిల్లా ఫీల్డ్ ఆఫీసర్స్ కు చెప్పారు. ఈ కార్యక్రమంలో KDCC బ్యాంక్ CEO రామాంజనేయులు గారు DROSD శ్రీ మతి నాగ లింగేశ్వరి దేవి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News