Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: మల్లన్న సన్నిధిలో పీఠాధిపతుల సందడి

Srisailam: మల్లన్న సన్నిధిలో పీఠాధిపతుల సందడి

శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్లను శ్రీ శ్రీ శ్రీసిద్ధ లింగ దేశికేంద్ర శివాచార్య మహాస్వామి, ఉజ్జయిని పీఠం, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి, కాశీ పీఠం, శ్రీశ్రీశ్రీ చెన్న సిద్ధ రామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి, శ్రీశైల పీఠం, శ్రీశ్రీశ్రీ మల్లికార్జున విశ్వరాధ్యశివాచార్య మహాస్వామి, కాశీపీఠం (ఉత్తరాదికార పీఠాధిపతి) సేవించారు.

ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతులకు వారి సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభస్వాగతం పలికారు. తరువాత పీఠాధిపతులు స్వామివారికి అభిషేకాన్ని పూర్తి చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో పీఠాధిపతుల గౌరవార్థం దేవస్థానం వేద గోష్ఠిని నిర్వహించి, వారిని సత్కరించింది. అనంతరం పీఠాధిపతులు భక్తులను ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News