Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Urusu: కౌతాళం-కురుగోడు ఖాదర్ లింగస్వామి ఉరుసుకు పోటెత్తిన భక్తులు

Urusu: కౌతాళం-కురుగోడు ఖాదర్ లింగస్వామి ఉరుసుకు పోటెత్తిన భక్తులు

కర్ణాటక రాష్ట్రంలోని కురుగోడు పట్టణంలో హజరత్ సయ్యద్ ఖాదర్ లింగస్వామి మొదటి ఉరుసు మహోత్సవం ఘనంగా సాగుతోంది. కౌతాళంలో వెలసిన ఖాదర్ లింగస్వామి దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ ఖాదర్ లింగస్వామి మొదటి ఉరుసు మహోత్సవానికి భక్తులు పోటెత్తారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొన్నారు. తిక్కారెడ్డికి దర్గా పీఠాధిపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసి శాలువా, పూలమాలతో సన్మానించారు. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఈ వేడుకలకు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అంతకుముందు కౌతాళంలో వెలసిన ఖాదర్ లింగస్వామి దర్గా నుండి భక్తులు ఊరేగింపుగా తరలి వెళ్లారు. ఈ వేడుకలలో పీఠాధిపతులు మున్నా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News