Thursday, October 24, 2024
Homeఆంధ్రప్రదేశ్YCP Big Expose: 'ట్రూత్ బాంబ్' పేల్చిన వైసీపీ.. సాక్ష్యాలతో సహా సంచలన పోస్ట్

YCP Big Expose: ‘ట్రూత్ బాంబ్’ పేల్చిన వైసీపీ.. సాక్ష్యాలతో సహా సంచలన పోస్ట్

YCP Big Expose| ఏపీ రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీ(YCP) మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ బ్రేకింగ్ న్యూస్‌లు చెబుతామంటూ టీడీపీ, వైసీపీ పోస్టులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రజల డిమాండ్ దృష్ట్యా బుధవారం రాత్రే టీడీపీ(TDP) బ్రేకింగ్ న్యూస్ బయటపెట్టేసింది. ప్రస్తుతం మాజీ సీఎం జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మ మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించిన విషయాలను వెల్లడించింది. ఆస్తుల పంపకాల విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న జగన్‌కు షర్మిల, తల్లి విజయమ్మ తీవ్ర ఆవేదనతో రాసిన లేఖలను బయటపెట్టింది. దీంతో వైఎస్ కుటుంబం వివాదాలు రోడ్డుకెక్కాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు.

- Advertisement -

ఇదిలా ఉండగానే.. వైసీపీ చెప్పిన ట్రూత్ బాంబ్‌ను రివీల్ చేసింది. ‘మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్‌ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్‌ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!’ అంటూ పోస్ట్ చేసింది. హైదరాబాద్ వేదికగా ఛానల్ నడుపుతున్న వ్యక్తి కుటుంబానికి డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆధారాలు బయటపెట్టింది. డ్రగ్స్ ముఠాతో వందల కొద్దీ కాల్స్ మాట్లాడినట్లు కాల్ లిస్ట్ పొందుపరిచింది. దీంతో ఆ ఛానల్ యజమాని ఎవరనే దానిపై చర్చ మొదలైంది. మొత్తానికి టీడీపీ, వైసీపీలు చెప్పినట్లుగానే సంచలన విషయాలు బయటపెట్టాయి. దీంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News