Tuesday, May 7, 2024
Homeపాలిటిక్స్Velichala: వెలిచాల రాజేందర్ కు బి ఫారం అందజేసిన పిసిసి చీఫ్, రేవంత్ రెడ్డి

Velichala: వెలిచాల రాజేందర్ కు బి ఫారం అందజేసిన పిసిసి చీఫ్, రేవంత్ రెడ్డి

బీఫారం అందుకున్న వెలిచాల

వెలిచాల రాజేందర్ రావుకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బి ఫారంను పిసిసి చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రోహిత్ చౌదరి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా తన ఎంపికకు సహకరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి వెలిచాల రాజేందర్ రావు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా కష్టపడి పనిచేసి వెలిచాల రాజేందర్రావును గెలిపించాలని, త్వరలో ఎన్నికల ప్రచారానికి కరీంనగర్ వస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్చార్జిలకు సూచించారు.

- Advertisement -


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మార్యాదపూర్వకంగా కలిసిన వారిలో మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హుజురాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ తదితరులు ఉన్నారు.కరీంనగర్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేయగా, ఈ మేరకు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, నేడు రాజేందర్ రావుకి కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ ను అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News