Tuesday, May 7, 2024
HomeతెలంగాణJadcharla: ప్రచారంలో జోరు పెంచిన వంశీచందర్ రెడ్డి

Jadcharla: ప్రచారంలో జోరు పెంచిన వంశీచందర్ రెడ్డి

పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి

ప్రతి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను మహబూబ్ నగర్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కోరారు. మిడ్జిల్ మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మిడ్జిల్, ఊరుకొండకు చెందిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్చర్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గోపాల్ రెడ్డి, ఊరుకొండ దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, దోనూర్ మాజీ సర్పంచ్ రవికుమార్ తో పాటు నాయకులు నరసింహారెడ్డి, ధర్మారెడ్డి, సర్దార్, రాజశేఖర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, బుచ్చిరెడ్డి, బాబా తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన వారికి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరిన వారు మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ఉండి వారిని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలననే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ వంశీచంద్ రెడ్డి అన్న గెలుపుకై మీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, మనందరం కలిసి వంశీచంద్ రెడ్డి అన్నను భారీ మెజార్టీతో గెలిపిద్దాం మని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News