Friday, May 10, 2024
Homeఫీచర్స్Girijans: కెసిఆర్ పాలనలోనే గిరిజనులకు స్వర్ణయగం

Girijans: కెసిఆర్ పాలనలోనే గిరిజనులకు స్వర్ణయగం

కెసిఆర్ కి గిరిజన సంఘాల సంపూర్ణ మద్దతు

గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టడానికి ఎస్టి తెగల వర్గీకరణ చేస్తారా అవాకులు చివాకులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 30వ తారీఖు ఎన్నికల్లో బుద్ధి చెప్పండి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గిరిజన లంబాడీలకు వెయ్యి రూపాయలు సారా చేశాయస్తే మనకు ఓటేస్తానని చెప్పి గిరిజన లంబాడీలను ఆత్మగౌరవాన్ని కించపరిచినాడు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గిరిజన లంబాడీలను తీరని అన్యాయం చేసింది.
టిఆర్ఎస్ పార్టీ ఏడు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ ఐదు టికెట్లు ఇచ్చింది. బంజారాల ఆరాధ దైవం సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని నారాయణఖేడ్ సభల్లో గిరిజనులు ఇవ్వడానికి పోతే మా భగవంతుడి చిత్రపటాన్ని పక్కన నెట్టేసి బంజారా సమాజాన్ని ఆత్మగౌరవం కించపరిచారు.
కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్లో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉద్యమకారులను విద్యార్థి నాయకులను యువతను పైన హేళన చేస్తూ మాట్లాడి విద్యార్థి లోకాన్ని ఇప్పుడే కండకావరంతో గిరిజనులు విద్యార్థి యువత మరి ఇతర సమాజాన్ని చూడకుండా వ్యవహరిస్తున్న వీరు తీరుపై యావత్ తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి నాయకుడుకి మొదలు లోనే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది
28.11.2023 ఈరోజు ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిలకే గిరిజన సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతుగా వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీరాష్ట్ర సమాచార కమిషనర్ డా.గుగులోతు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి మీడియా సమావేశం నిర్వహించిది.

- Advertisement -

గతంలో కాంగ్రెస్ పార్టీకి 11సార్లు ఓటేసినా గిరిజన బతుకులు మారలేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లాగానే ఉంది, అలాగనే రైతుబంధు రాకుండా కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుపడుతుంది హైకోర్టు ఎన్నికల కమిషన్ రైతుబంధు చేసుకోవచ్చని చెప్పినా మళ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రలు కుతంత్రాలు చేసి రైతుబంధు కు అడ్డుపడుతున్నారు ఇలాంటి నాయకులకు రేపు 30వ తారీకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతు సమాజం అందరూ నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించాలి…


గిరిజనులకు టిఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు తండాలను గ్రామపంచాయతీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి 2004, 2009 రెండు సార్లు విజయం సాధించిన గిరిజనుల గూడును పట్టించుకున్న దాఖలాలు లేవు మాయ మాటలు చెప్పి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తన్నుకోవడం వెన్నెతో పెట్టిన విద్య అని శంకర్ మండిపడ్డారు అంతేకాకుండా గిరిజనులకు లంబాడీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ లో కూడా అన్యాయం చేసింది అదే విధంగా గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టడానికి ఎస్టి తెగలను వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గిరిజనుల మధ్య చిచ్చు పెడుతుంది గందరగోళాన్ని సృష్టిస్తుంది మన కళ్ళ ముందు కనిపిస్తుంది అలాగే గిరిజన లంబాడీలకు ఎన్నికల్లో సారా సీసా 1000 రూపాయలు ఇస్తే కాంగ్రెస్ ఓటేస్తారని గిరిజన లంబాడీలను కించపరిచి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా వారి కుట్రలను కుతంత్రాలు పాతాళ లోకంలో తొక్కే విధంగా రేపు జరగబోయే 30వ తారీఖు ఎన్నికల్లో కెసిఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి గిరిజనులు ఆత్మగౌరవంతో స్వయం పాలన చేసుకునేలాగా ఆత్మగౌరవంతో బతికేలాగా అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిద్దాం. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన లంబాడీలకు 10 శాతం రిజర్వేషన్ 3500 పై చినుకు తండాలని గ్రామపంచాయతీ పిల్లల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం విదేశాలలో చదువుకోడానికి 20 లక్షల రూపాయల తోవిదేశీ విద్యను అభ్యసించడానికి ఏర్పాటు చేయడం గిరిజన లంబాడీల ఆత్మగౌరవ ప్రతీకగా బంజారాహిల్స్ లో బంజారా భవనం ఎకరం స్థలంలో 21 కోట్ల రూపాయలతో నిర్మించడం బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి అధికారికంగా పండగ నిర్వహించడం గిరిజనుల జీవనస్థితి గతులు మార్చడానికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా గిరిజన ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసుకోవడానికి లక్ష 100016 రూపాయలు అందించి ఆసరాగా ఉండడం గిరిజన తాతలకు అవ్వలకు ముసలోళ్లకు ఆసరా పింఛన్ తో అండగా నిలవడం కేసీఆర్ కిట్టు రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి పోడు భూముల పట్టాలు 24 గంటల కరెంటు గురుకుల పాఠశాలలు గిరిజన యువతకు యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సీఎం ఎస్టీ ఎంటర్పినర్జీ కోటి రూపాయల కోటిన్నర రూపాయల చొప్పున లోను కల్పించడం గిరి వికాస్ ద్వారా బోరు వేసి బోరు బావికి మోటరు ట్రాన్స్ఫారం విద్యుత్ సౌకర్యం కల్పించడం, గిరిజన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో రాణించడానికి కోచింగ్ కేంద్ర లు ఏర్పాటు చేయడం గిరిజన గురుకులాలకు పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఛాన్తాడంత పెద్ద లిస్టు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి వివిధ తండాల్లో గూడాల్లో పల్లెల్లో గ్రామాల్లో తండాల్లో కెసిఆర్ ఎన్నికల ప్రచారం చేస్తూ గ్రామాల్లో తండాల్లో అమ్మ అక్క చెల్లెలు అందరితో మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ గారు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ కెసిఆర్ నాయకత్వంలోనే గిరిజనులకు స్వర్ణయగం గిరిజనుల అన్ని రంగాల్లో అభివృద్ధిలో రాణించారని డా. శంకర్ నాయక్ కొనియాడారు. కెసిఆర్ హయాంలో 500 జనాభా ఉన్న తండాలం గ్రామపంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ కళ్యాణ లక్ష్మి పథకం రైతుబంధు పథకం కెసిఆర్ కిట్టు గురుకులాలు విదేశీ విద్య పథకం 24 గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా గిరిజనులు అభివృద్ధికి నోచుకోవడానికి ఎంతగానో దోహద పడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగడం కోసం కెసిఆర్ కి మరొక్కసారి నియోజకవర్గంలో ప్రజలు, గిరిజన లంబాడీల ఓటు బ్యాంకును వన్ సైడ్ అన్న కారు గుర్తును ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారా అని సగరువంగా తెలియజేయండి గిరిజనులు బంజారా లు బ్రహ్మరథం పడుతున్నారు పథకాల గురించి మాకు ఎంతగానో దోహదపడ్డాయని సగర్వంగా చెబుతున్నారు గెలిచే నాయకుడు అన్నకి మేము ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గిరిజన తండాల్లో గూడాల్లో గిరిజన లంబాడి సోదరులు తెలియజేస్తున్నారని శంకర్ నాయక్ పేర్కొన్నారు. గిరిజన నాయకులకు ప్రజలకు కార్యకర్తలకు ఈ ఐదు రోజులు కేసీఆర్, అన్న చేసిన సంక్షేమ పథకాలను తండాల్లో గడపగడపకు తీసుకెళ్లి తండా ప్రజలకు చైతన్యం చేసి 30 తారీకు వరకు పోలింగ్ బూత్ వరకు గిరిజన లంబాడి ప్రజలందరిని తీసుకెళ్లి పోలింగ్ లో పాల్గొని భారీ మెజార్టీతో అన్న గెలుపు భారీ మెజార్టీ గెలిపించేలాగా కృషి చేయాలని శంకర్ నాయక్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గిరిజన సంక్షేమం రాష్ట్ర అధ్యక్షుడు డా. గుగులోతు రాజు నాయక్, ఆదివాసి సంఘం అధ్యక్షులు జెర్రీ బాలకృష్ణ పోడెం సంపత్ వర్ధన్ కామేష్ అనిల్ తెలంగాణ ఎరుకల సంఘం కుర్రు రాష్ట్ర అధ్యక్షులు రాములు సత్యనారాయణ గ్రేడ్ హైదరాబాద్ అధ్యక్షులు ఎల్ ఎస్ ప్రధాన కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్ మల్లేష్ అడ్వైజరీ మల్లేష్ , పోచయ్య ,విశ్వనాథ్ ,శోభ ఓయూ జెఏసి ప్రెసిడెంట్ గుగులోతు చెట్టినాయక్, కోఆర్డినేటర్,సురేష్ నాయక్, బీ మురళి కృష్ణ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, యువజన శ్రీను రాథోడ్ , చందు నాయక్…. తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News