Saturday, May 11, 2024
HomeఆటIllanthakunta: జంగంరెడ్డిపల్లె విజయం

Illanthakunta: జంగంరెడ్డిపల్లె విజయం

రన్నర్ గా ఇల్లంతకుంట జట్టు

ఇల్లంతకుంట మండలం జంగంరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా మ్యాచ్ ఆసక్తిగా సాగింది. చివరకు జంగంరెడ్డి పల్లె క్రికెట్ జట్టు ఇల్లంతకుంట జట్టుపై 14 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ విజేతగా నిలిచింది. గత 25 రోజులుగా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను శ్రీరామలింగేశ్వర యూత్ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన జంగంరెడ్డి పల్లె జట్టుకు మాజీ సర్పంచ్ తుంకుంట్ల శ్రీలత నరేందర్ రెడ్డి 16 వేల రూపాయలతో పాటుగా కప్పును అందజేశారు. ఇల్లంతకుంట జట్టుకు నాగరాజు పంతులు (జంగంరెడ్డిపల్లె )ఎనిమిది వేల రూపాయలతో పాటుగా కప్ ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి, చక్రధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్, శేఖర్, రమేష్ కార్తీక్ రెడ్డి అరుణ్, రాజు సాయి ప్రశాంత్ , వేణు, శ్రీ రామలింగేశ్వర క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News