Friday, May 10, 2024
HomeతెలంగాణGarla: పాల వ్యాపారి కూతురు, ఫస్ట్ ర్యాంకర్ కి సన్మానం

Garla: పాల వ్యాపారి కూతురు, ఫస్ట్ ర్యాంకర్ కి సన్మానం

చదువుల తల్లి ప్రణీత

ఇటివల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్దాయిలో ప్రధమ స్థానం సాధించిన మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన పల్లెబోయిన ఒక ప్రణతిని స్దానిక మంగపతిరావు భవనంలో గొర్రెల, మేకల పెంపక దార్ల సంఘం అధ్వర్యంలో శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇమ్మడి గోవింద్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. బుద్దారం గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన పల్లె బోయిన నాగరాజు-అరుణ దంపతులకు చెందిన విద్యార్దిని ప్రణతీని పాల వ్యాపారం చేస్తూ ఖమ్మంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ లో ఎంపిసి ప్రథమ సంవత్సరం చదివిసున్నారు. ప్రణతి 468 మార్కులు సాధించడం అభినందనీయం అన్నారు. ప్రణీత మరింత పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం నాయకులు సంపసాల వెంకన్న, జడ శ్రీను, తెలగర్ల నాగేశ్వరరావు, యూ టి ఎఫ్ జిల్లా నాయకులు సుందర్ కుమార్, సిపియం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, సభ్యులు నాగేశ్వరరావు, నంద్యా నాయక్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News