Friday, May 10, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: పార్లమెంటుకు 503 నామినేషన్లు, అసెంబ్లీకి 2,705 నామినేషన్లు

AP: పార్లమెంటుకు 503 నామినేషన్లు, అసెంబ్లీకి 2,705 నామినేషన్లు

పీసీలకు చెందిన 183 నామినేషన్లు, ఏసీలకు చెందిన 939 నామినేషన్లు తిరస్కణ

ఈనెల 26న జరిగిన నామినేషన్ల పరిశీలనలో 25 పీసీలకు 503 నామినేషన్లు, 175 ఏసీలకు 2,705 నామినేషన్లను ఆమోదించినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పీసీలకు చెందిన 183 నామినేషన్లు, ఏసీలకు చెందిన 939 నామినేషన్లను పరిశీలన అనంతరం తిరస్కరించామన్నారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో 25 పీసీలకు సంబంధించి మొత్తము 686 నామినేషన్లు, 175 ఏసీలకు సంబంధించి మొత్తము 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు ఆయన తెలిపారు.

- Advertisement -

పీసీలకు సంబంధించి అత్యధిక మొత్తంలో గుంటూరు పీసీకి 47 నామినేషన్లు, అత్యల్పంగా 16 నామినేషన్లు శ్రీకాకుళం పీసీకి దాఖలు అయ్యాయని తెలిపారు. నామినేషన్ల ఆమోదం విషయంలో అత్యధికంగా 36 నామినేషన్లు నంద్యాల పిసికి, అత్యల్పంగా 12 నామినేషన్లు రాజమండ్రి పిసికి ఆమోదించామన్నారు.

ఏసీలకు సంబంధించి అత్యధిక మొత్తంలో తిరుపతి ఏసీ కి 52 నామినేషన్లు, అత్యల్పంగా 8 నామినేషన్లు చోడవరం ఏసీకి దాఖలు అయ్యాయని తెలిపారు. నామినేషన్ల ఆమోదం విషయంలో అత్యధికంగా 48 నామినేషన్లు తిరుపతి ఏసీకి, అత్యల్పంగా 6 నామినేషన్లు చోడవరం ఏసీకి ఆమోదించామన్నారు.

ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని, నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు మినహా మిగిలిన వారు మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా పరిగణించబడతారని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News