Saturday, May 4, 2024
HomeదైవంJadcharla: వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

Jadcharla: వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

నాగసాల నుంచి కావేరమ్మపేట వరకు సాగిన యాత్ర

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హిందు వాహిని ఆధ్వర్యంలో జడ్చర్లలో మంగళవారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర శోభయమానంగా సాగింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల శివారులో ఆంజనేయస్వామి ఆలయం నుంచి విజయ సంకల్ప శోభాయాత్ర ప్రారంభమైంది.

- Advertisement -

బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ హాజరై నేతాజీ చౌరస్తాలో శోభాయాత్రకు స్వాగతం పలికారు. మున్సిపాలిటీ పురవీధుల గుండా భారీగా సాగుతూ హౌసింగ్ బోర్డ్ మీదుగా కావేరమ్మపేట వరకు యాత్ర కొనసాగింది. శోభాయాత్రలో పాల్గొన్న హనుమ భక్తులు కాషాయ జెండాలు చేతబట్టి జై శ్రీరామ్, జై హనుమాన్, జై భజరంగ్ బళి.. అంటూ ఉత్సాహంగా ముందుకు సాగారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని పలు హనుమాన్ దేవాలయాల్లో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News