Thursday, June 26, 2025
Homeనేషనల్PM Modi: ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

PM Modi: ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

దేశ ప్రజలకు ప్రధాని మోదీ (PM Modi) మకర సంక్రాంతి(sankranti) శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ పండుగ వేళ ప్రజలంతా పాడిపండలు, ఆరోగ్యం, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయంలోనూ సంక్రాంతి అంతర్భాగమైనదని అన్నారు.

- Advertisement -

కాగా ఢిల్లీలోని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఇంట నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో ప్రధాని పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా తులసికోటకు పూజలు చేసిన అనంతరం భోగి మంట వెలిగించారు. గంగిరెద్దులకు ఆహారం అందించి వాటిని ఆడించేవారికి సంప్రదాయ వస్త్రాలు బహూకరించారు. మోదీకి కిషన్‌రెడ్డి దంపతులు, మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తదితరులు సాదర స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News