Saturday, May 4, 2024
Homeపాలిటిక్స్Dharmavaram: ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా

Dharmavaram: ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా

నామినేషన్ దాఖలు

ధర్మవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ నామినేషన్‌ కార్యక్రమం జనసంద్రంతో జరిగింది. వేలాదిమంది అభిమానులతో కార్యకర్తలతో ఆయన ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. సత్య కుమార్ యాదవ్, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, సినీ హీరో సాయికుమార్, ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి విజయ్ కుమార్ సింగ్ హాజరై శివానగర్ లోని శివాలయం నందు శివునికి ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

పెద్ద ఎత్తున వచ్చిన జనంతో కలిసి ఫైర్ స్టేషన్ నుండి కళా జ్యోతి సర్కిల్ వరకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ర్యాలీగా తరలి వచ్చారు. అక్కడి నుంచి కేంద్రమంత్రి విజయ్ కుమార్ సింగ్, పరిటాల శ్రీరామ్, చిలక మధుసూదన్ రెడ్డిలతో కలిసి ఆర్డిఓ ఆఫీస్ లో సత్య నామినేషన్ వేశారు. సత్య కుమార్ యాదవ్ నామినేషన్కు బిజెపి శ్రేణులు, టిడిపి శ్రేణులు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వంలో దేశం ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టిడిపి, బిజెపి, జనసేన నాయకులు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేల సంఖ్యలో సంఖ్యలో తరలి వచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News