Sunday, April 28, 2024
HomeతెలంగాణKukatpally: రక్తదాన శిబిరంలో పాల్గొన్న మాధవరం

Kukatpally: రక్తదాన శిబిరంలో పాల్గొన్న మాధవరం

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కూకట్పల్లి శాంతినగర్ లోని చింతపట్ల వెంకయ్య పార్కులోని సంకల్ప ప్రింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంకల్ప ప్రింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అభినందిస్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని మంచి పౌష్టికాహారం సరైన వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, రఘుకుమార్, నవీన్ కుమార్, రమేష్ బాబు ఈశ్వర్, వెంకట్రావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News