Friday, May 10, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: బెల్ట్ షాపులపై ఉక్కుపాదం

Rajanna Sirisilla: బెల్ట్ షాపులపై ఉక్కుపాదం

డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపారు. సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి, 96 కేసులల్లో 4,60,623 రూపాయల విలువ గల 760 లీటర్ల మద్యం సీజ్ చేశారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో 109 కేసులల్లో 5,17,123 రూపాయలు విలువ గల 957 లీటర్ల మద్యం సీజ్ చేసి ఉక్కుపాదం మోపినట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

గ్రామాల్లో, పట్టణాల్లోని ఇండ్లలో, హోటళ్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, కిరాణా షాపులలో ఇతర దుకాణాలలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా బెల్ట్ షాపు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వైన్స్ యజమానులు కూడా నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపు నిర్వాహకులకు మద్యం విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News