Friday, May 10, 2024
Homeనేరాలు-ఘోరాలుRajanna Sirisilla: సైబర్ మోసాల ముఠాను కంబోడియాలో పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు

Rajanna Sirisilla: సైబర్ మోసాల ముఠాను కంబోడియాలో పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు

పాస్ పోర్టు తీసేసుకుని సైబర్ నేరాలు చేయించే గ్యాంగ్

చైనీస్ కంపెనీలలో సైబర్ నేరాలను చేపిస్తున్న ముఠాను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు కంబోడియా దేశంలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ కార్యాలయానికి నాలుగు రోజుల క్రితం సిరిసిల్ల పట్టణం పెద్దూర్ గ్రామానికి చెందిన అతికం లక్ష్మీ అనే మహిళ వచ్చి తన కొడుకు అతికం శివప్రసాద్, జగిత్యాల జిల్లా కోడిమ్యాల గ్రామానికి చెందిన కంచర్ల సాయి ప్రసాద్ అనే ఏజెంట్ కి 1,40,000/- రూపాయలు ఇచ్చి కాంబోడియా దేశానికి వెళ్లాడు అని చెప్పారు. శివ ప్రసాద్ మొబైల్ నెంబర్ తీసుకొని వాట్సప్ ద్వారా మాట్లాడగా ఇక్కడ చైనీస్ కి చెందిన కంపెనీలో శివప్రసాద్ పాస్ పోర్ట్ తీసుకొని సైబర్ నేరాలు చేపిస్తున్నారని, తనలాగా ఇక్కడ భారతదేశానికి చెందిన 500 నుంచి 600 మంది బాధితులు ఉన్నారని తెలిపాడు. వీరందరితో కాల్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి ఇండియన్ ఫోన్ నంబర్స్ ఇచ్చి లాటరీ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, టాస్క్ లు ఇచ్చి, ఈ టాస్క్ లు చేస్తే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని సైబర్ మోసాలు చేయియిస్తున్నారని శివప్రసాద్ తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. వెంటనే సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కంబోడియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి బాధితుని డీటెయిల్స్ షేర్ చేయగా అక్కడి లోకల్ పోలీసుల సహాయంతో శివ ప్రసాద్ ను కాపాడినట్టు, శివ ప్రసాద్ రెండు రోజుల లోపు ఇండియాకు చేరుకుంటారని, అక్కడ ఉన్న బాధితులని కాపాడి ఇండియాకి పంపిస్తామని తెలిపారు.

- Advertisement -

జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయిప్రసాద్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని ఆపిల్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని విచారించగా 10,000 రూపాయలు కమీషన్ తీసుకొని లక్నోకి చెందిన సదాకత్ అనే వ్యక్తికి పంపగా ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఉంటునన్నాడని, అతను 10,000 రూపాయల కమీషన్ తీసుకొని పూణేలో ఉన్న అబిద్ అన్సారీకి పంపగా, వీరి వెనుక ఉన్న బీహార్ రాష్టానికి చెందిన ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న షాదబ్ అనే వ్యక్తికి పంపగా షాదబ్ కంబోడియా దేశానికి పంపుతాడని తెలిపారు. వీరిలో జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్ ని, పూణే లో ఉన్న అబిద్ ఆన్సరీని అదుపులోకి తీసుకుని, మిగతా ఇద్దరిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

సైబర్ సెక్యూరిటీ వారి సహాయంతో ఈ కేసును ఛేదించామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్యోగ, ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళే యువకులు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెన్సీల మాత్రమే ఆశ్రయించాలని ఎస్పీ కోరారు. జిల్లాలో ఎవరైతే ఏజెన్సీల లేదా ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారి కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అధికారి ఫోన్ నెంబర్ 8712656411 కి నేరుగా ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుపై తగిన రీతిలో విచారణ జరిపి, నేరం రుజువైతే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ రఘుపతి, టాస్క్ఫోర్స్ సి.ఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News