Sunday, April 28, 2024
HomeతెలంగాణKTR in Thangallapalli: సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ టూర్

KTR in Thangallapalli: సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ టూర్

రైతు సమస్యలపై ఉద్యమిస్తాం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించి, ఎండిన పొలాలను పరిశీలించారు. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను చూసి, స్థానిక రైతులతో ఆయన ముచ్చటించారు. చేస్తానన్న రుణమాఫీ చేయలేదు కదా, బ్యాంకుల ద్వారా నోటీసులు ఇప్పిస్తూ, మెడపైన కత్తి పెట్టి రుణాలు కడతారా చస్తారా అన్నట్లు ఉందంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఎండిన పోయిన పది పదిహేను లక్షలు ఎకరాలను రాష్ట్రవ్యాప్తంగా మా ఎమ్మెల్యేలతో పరిశీలుస్తున్నామన్నారు. రైతులను చూస్తే నిజంగానే బాదేస్తుందన్న కేటీఆర్..ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆరోపించారు. మేడిగడ్డ వద్ద కుంగిపోను మూడు పిల్లర్లు వద్ద కాపర్ డామ్ కడితె అయిపోయేదని, ఢిల్లీకి జాతరలు, యాత్రలు తప్పితే రాష్ట్రానికి రేవంత్ చేసిందేమీ లేదని ఆరోపించారు. కౌలు రైతులు, రైతులకు చేస్తానన్న లబ్ది చేకూర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇస్తానన్న క్వింటాలుకు 500 బోనస్ వెంటనే ఇవ్వాలని, రైతులు ధైర్యంగా ఉండి పోరాడాలన్నారు. రైతులు ఆత్మహత్యలు లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తిచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News